చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ తూర్పు లడఖ్లోని భారత్-చైనా సరిహద్దులో మోహరించిన సైనికులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించడం చర్చనీయాంశం అయింది. భారత్ చైనా సరిహద్దులో మోహరించిన సైనికుల పరిస్థితులతో బాటు వారి యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక మీడియా వెల్లడించింది.
ఇక్కడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) ప్రధాన కార్యాలయం నుండి జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ ఆధ్వర్యంలోని ఖుంజ్రాబ్లోని సరిహద్దు రక్షణ పొజిషన్లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. తూర్పు లడఖ్లోని పాంగోంగ్ సరస్సు సమీపంలో 2020 నాటి హింసాత్మక ఘర్షణ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ నాటి నుండి భారతదేశం మరియు చైనా మధ్య LAC పై ఉద్రిక్తత ఉంది.
ఇటీవల, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లోకి కూడా చొరబడేందుకు ప్రయత్నించింది. అయితే భారత సైన్యం వెంటనే జోక్యం చేసుకోవడంతో తిప్పికొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా మళ్లీ చొరబాట్లకు పాల్పడే అవకాశం ఉంది. వీడియో కాల్లో వారి పోరాట సంసిద్ధతను ఆయన పరిశీలించారని నివేదిక పేర్కొంది. ఇప్పుడు 24 గంటలూ సరిహద్దుల్లో కాపలా కాస్తున్నామని ఓ జవాను బదులిచ్చారు.
జీ అతని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతంలో కూడా తాజా కూరగాయలు లభిస్తున్నాయా అని అడిగారు. సరిహద్దు పెట్రోలింగ్ మరియు నిర్వహణ పనుల గురించి సరిహద్దు దళాలను జి అడిగినట్లు అధికారిక మీడియా నివేదించింది. అతను సరిహద్దులో కాపలాగా ఉన్న కొంతమంది సైనికులను సత్కరించాడు. వారి ప్రయత్నాలను కొనసాగించడానికి వారిని ప్రోత్సహించాడు.