చిన్నారి చైత్ర పై ఈనెల 9న జరిగిన అత్యాచార సంఘటనకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
నిందితుడు రాజు ను వెంటనే ఉరి తీయాలని,చైత్ర కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గిరిజనులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సోదరులు బానోత్ హుస్సేన్ నాయక్,భూక్యా బాబు నాయక్,భూక్యా నాగ నాయక్,బానోతు నాగేశ్వరావు నాయక్,భూక్యా జయరాం నాయక్,అజ్మీరా వెంకట్ నాయక్, లావుడ్య నాగేశ్వరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్