హైదరాబాద్ నగరంలో సింగరేణి కాలనిలో ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి ఉరి శిక్ష అమలు చేయాలని, చైత్ర కుటుంబనికి ప్రభుత్వం అండగా నిలిచి వెంటనే ఎక్స్ గ్రేసీయా ప్రకటించాలని సమాచార హక్కు సాధన సమితి హుజూర్ నగర్ నియోజకవర్గం కన్వీనర్ ఆది మళ్ళ గోపి డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా గోపి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్ళుగా మహిళాలపై ఈ దేశంలో రక్షణ లేకుండా పోయిందని, అత్యాచారం,హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. గిరిజన కుటుంబనికి చెందిన ఆరు సంవత్సరాల పసి బిడ్డ చైత్ర అత్యాచారం,ఆపై హత్య చేసిన నిందితుడికి వెంటనే ఉరి శిక్ష అమలు చేసి ఆ కుటుంబనికి ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్