ఖాకీ ల అదుపులో 35 ఏళ్ల వ్యక్తి…!
విద్యలనగరం కాస్త…గంజాయి నగరంగా మారుతోందనటానికి.. విజయనగరం వన్ టౌన్ పోలీసులకు పట్టబడిన 5 కేజీల గంజాయి అందుకు ఓ నిదర్శనం. ఇటీవలే విజయనగరం సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో…. రైల్వే స్టేషన్ లో తనిఖీ లు నిర్వహించారు.ఆ తనిఖీల్లో లభించిన క్లూస్ తో ఇప్పటికే వన్ టౌన్ క్రైమ్ ఎస్ఐ అశోక్…
పరాయి రాష్ట్రం వెళ్లినట్లు సమాచారం. కాగా..ఇటీవలే కొత్త గా విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో… వన్ పోలీసులకు లభించిన సమాచారం తో నగరంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద..నగర వన్ టౌన్ సీఐ..అతని బృందం.. ఎస్ఐ లు భాస్కరరావు, రామ్ గణేష్ లు..అయిదు కేజీల గంజాయి కలిగి ఉన్న 34 ఏళ్ళ బొంతు వెంకేశ్వరరావును
పట్టుకున్నారు.అతని వద్ద నుంచీ 5 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకుని…నిందితుడు పై కేసు నమోదు చేసినట్లు. సీఐ డా.వెంకటరావు తెలిపారు.