40.2 C
Hyderabad
April 28, 2024 17: 08 PM
Slider హైదరాబాద్

అక్కడికక్కడే మృతి చెందిన నలుగురు నిందితులు

sajjanar 01

గత నెల 27వ తేదీన దిశపై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే. అదే ప్రదేశంలో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా ఎన్ కౌంటర్ జరిగింది. నేటి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

జైల్లో ఉన్నప్పుడు నిందితులను వేరువేరుగా ఉంచారు. నిందితులను ఘటనకు పాల్పడిన ప్రాంతానికి తీసుకురాగానే అరగంటపాటు విచారణ జరిగిన అనంతరం ఆరిఫ్ మొదట పోలీసులపై దాడి చేశాడు. అనంతరం మిగతా ముగ్గురు పోలీసులపై తిరగబడ్డారు.

నిందితులు పోలీసుల వద్ద నున్న తుపాకులు లాక్కొని పారిపోతుండగా కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. సంఘటన స్థలంలోనే నాలుగురూ మరణించారు.

Related posts

కూకట్‌పల్లి సిఐగా బాధ్యతలు  చేపట్టిన సురేందర్

Satyam NEWS

రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

Satyam NEWS

కరోనా కట్టడి చేయలేక మమ్ములను అరెస్టు చేస్తారా?

Satyam NEWS

Leave a Comment