రాష్ట్రంలో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు కావడంతో కేసు దర్యాప్తు చేసిన సిఐని అభినందనలు వెల్లువెత్తాయి.
తొమ్మిది హత్యలకు కారకుడైన వ్యక్తికి ఉరి శిక్ష పడే విధంగా కేసు పరిశోధించి పక్కా సాక్ష్యాధారాలు సేకరించడంతో న్యాయమూర్తి కచ్చితమైన తీర్పు వెలువరించారు.
కేస్ ఫైల్ అయినప్పడి నుండి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సి.ఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు.
సంజయ్ కు ఉరిశిక్ష పడేలా కృషి చేసిన గీసుగొండ సీఐ శివరామయ్యకు అన్నివర్గాల ప్రజలు, అధికారులు, నాయకులు అభినందలు తెలుపుతున్నారు.