ప్రజల సమస్యల పరిష్కారం కోసం వార్తలు సేకరించడమే కాదు.. సామాజిక సేవలో కూడా జర్నలిస్టులు ముందంజలో ఉంటారని నిరూపించారు. అత్యవసర సమయంలో ఓ మహిళకు ఆపరేషన్ నిమిత్తం రక్తం కావాల్సి వస్తే ఇద్దరు జర్నలిస్టులు తమ రక్తాన్ని దానం చేశారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన హేమలత అనే మహిళకు ఛాతిలో గడ్డలు తొలగించారు. ఈ ఆపరేషన్ నిమిత్తం రెండు యూనిట్ల రక్తం అవసరం ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా జర్నలిస్టులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ రక్త నిధి విభాగంలో సాక్షి విలేఖరి మాణిక్య శ్రీకాంత్, రాజ్ న్యూస్ విలేఖరి లక్ష్మీ నారాయణ గౌడ్ లు రక్తం అందించారు.
ఈ సందర్బంగా అత్యవసర సమయంలో రక్తం అందించిన జర్నలిస్టులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10 టీవీ వేణు, ఏబీఎన్ శ్రీనివాస్, టి న్యూస్ రాము, విసిక్స్ నాగరాజు, ఐ న్యూస్ సురేష్, ఈటీవీ శ్యామ్ గౌడ్, హెచ్ఏంటీవి రాజు, భారత్ టుడే కిషన్, 99 టీవీ సాయిబాబా పాల్గొన్నారు