28.7 C
Hyderabad
April 26, 2024 08: 37 AM
ఆంధ్రప్రదేశ్

జగన్ సొంత ఖర్చుతో కోర్టుకు హాజరు కావాలి

tdp vij 2

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కోర్టు కేసులను ఎదుర్కోవాలని టీడీపీ సీనియర్ నేత ముహమ్మద్ ఫతాఉల్లాహ్ డిమాండ్ చేశారు. ప్రతి శుక్రవారం కోర్టు కు హాజరు అయ్యేందుకు ప్రభుత్వ సొమ్ము 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెబుతున్న ఆయన అసలు సొంత కేసులకు ప్రభుత్వం సొమ్ము ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు. కోర్టుకు సొంత ఖర్చులతో హాజరు అవ్వాలని ఆయన అన్నారు. ప్రతి వారం జగన్ హాజరు కావాల్సిదేనని చెప్పిన సిబిఐ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజలు వాళ్ళ ముఖ్యమంత్రి చేసిన అభి వృద్ధి గురించి చర్చించుకుంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి కోర్టు కు ఎప్పుడు వెళుతారు సిబిఐ కోర్టు ఏమి చెప్పింది ముఖ్యమంత్రి  కి శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ప్రజల్లో చర్చ జరుగుతున్నదని ఇది మన రాష్ట్రానికి సిగ్గు చేటు అని ఆయన అన్నారు.

Related posts

వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం

Satyam NEWS

వెల్కమ్: మోదీకి శుభలేఖ అందించిన సీఎం రమేశ్

Satyam NEWS

బేషరతుగా కలిసి పని చేస్తున్న జనసేన బిజెపి

Satyam NEWS

Leave a Comment