29.7 C
Hyderabad
April 29, 2024 08: 15 AM
Slider విశాఖపట్నం

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

#YS Jagan Mohan Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం 9.15 గంటలకు ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. తొలుత ఆయన శ్రీ శారదా పీఠానికి వెళ్తారు.

శారదాపీఠం వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అక్కయ్యపాలెం సాగరమాల కన్వెన్షన్ హాల్ కు చేరుకుని అనకాపల్లి ఎంపీ సత్యవతి కుమారుడు డాక్టర్ యశ్వంత్, డాక్టర్ స్రవంతి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం 1.30 గంటలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుని ఆయన కుమారుడు శరత్ చౌదరి, జ్ఞానిత దంపతులకు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి విద్యాసాగర్ నాయుడు, భవ్య దంపతులను ఆశీర్వదించనున్నారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

Related posts

మునిసిపాలిటీ ఆస్తులను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకోవాలి

Satyam NEWS

అక్రమ భారీ షెడ్డు నిర్మాణం: పట్టించుకోని టౌన్ ప్లానింగ్ ఎ సి పి

Satyam NEWS

మాస్క్ లు చిన్నారులకు సరిపోవు..మరి ఎలా తొడిగారంటే…?

Satyam NEWS

Leave a Comment