రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంటారు. 11 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం 11:50 గంటలకు మిడ్ మానేరు(రాజరాజేశ్వరస్వామి )డ్యాంను సందర్శించనున్నారు.
మిడ్ మానేరు డ్యాంను పూర్తిస్థాయి నీటి మట్టం నింపడం ఇదే మొదటి సారి. ఈ నీటితో రెండు లక్షల 35వేల ఎకరల పంట సాగులోకి రానుంది. మధ్యాహ్నం 1 గంటలకు తీగలగుట్ట పల్లి చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు.