కళలకు కాణాచి ,విద్యలనగరం అయిన విజయనగరం జిల్లాలో ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ కు చెందిన సేవాభారతి తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించుకుంది. ముప్పై ఏళ్ల క్రితం కళ…ఎట్టకేలకు సాకారం అయింది. నగరంలోని పూల్ భాగ ఎస్బీఐ దగ్గర మూడు అంతస్థుల సొంత భవనం నిర్మాణం జరిగింది. ఏడాది కితం ఆదే స్థలంలో భూమి పూజ జరిగింది. గిర్రున పన్నెండు నెలలతో విరాళాలు,సొంత ఖర్చులతో మరికొందరి దాతల సహకారంతో ఎట్టకేలకు రూపు దాల్చుకుంది…సేవాభారతి సొంత కార్యాలయం. మూడు అంతస్థులతో సువిశాలమైన గదులు..హాలు సకల సదుపాయాలు,ఆదునిక హంగులతో సేవాభారతి తాలూకా మూడు జిల్లాల విభాగ్ కార్యాలయాన్ని విభాగ్ సంఘ్ చాలక్ కృష్ణం రాజుచే..ప్రారంభించబడింది. కార్యక్రమం మొత్తం జిల్లా సంఘ్ చాలక్ సీహెచ్.వీ రమణ మూర్తి ఆధ్వర్యంలో పరిమిత సంఖ్యలో కరోనా నిబంధనలను అనుసరించే కార్యాలయ ప్రారంభోత్సం జరిగింది.ఈ సందర్భంగా విభాగ్ సంఘ్ చాలక్ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి పలు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటోందన్నారు.గత నాలుగు దశాబ్దాల నుంచీ సొంత భవనం అనేది లేకుండా ఉందని..అయితే దాతలు,పెద్దలు,సమాజ సేవ పట్ల అకుంఠిత దీక్ష కలిగిన వారి సేవలను చూసి..ఓ సొంత కార్యాలయం ఉండాలని సంకల్సం జరిగిందని..దాని రూపకల్పనే కొత్త భవనం రూపుదిద్దుకుందన్నారు. ఈ శ్రావణ మాసం లో పూర్తి స్తాయిలో మూడు జిల్లా కు సంబంధించి విభాగ్ కార్యాలయం పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర కార్యవహ నాయుడు,జిల్లా కార్యవహ వర్మ,ఆర్ఎస్ఎస్ ప్రచారక్ లోవారెడ్డి , సంఘ పెద్దలతో పాటు పలు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
previous post