కేసీఆర్ ఆధ్వర్యలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ నల్లకుంట డివిజన్ అంబర్ పేట్ కు చెందిన సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నలకుంట డివిజన్ లోని కృష్ణా నగర్ నివాసి కే.మాధవి కి మేజర్ ఆపరేషన్ జరిగింది.
అయితే వారిది పేద కుటుంబం కావడంతో అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వారిని ఆదుకోవడానికి వారితో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. రాష్ట్ర ఆర్థికమంత్రి టి హరీష్ రావు కు సమాచారం చేరడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించే విధంగా చేశారు. దాంతో మొత్తం రూ. 35000 మంజూరు అయింది. ఈ చెక్కును దూసరి శ్రీనివాస్ గౌడ్ వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.