కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాన్ గల్ మండలం మాధవరావు పల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం సహాయ నిధి చెక్కును అందించారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 4 లక్షల రూపాయల LOC ని అందజేశారు.
అదేవిధంగా పాన్ గల్ మండల కేంద్రానికి చెందిన అక్కమ్మ కుటుంబానికి 79 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.
కచ్చితంగా పార్టీల తో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిఒక్కరికి సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. అవసరమైన వారు సిఎం సహాయ నిధిని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.