అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.
కొల్లాపూర్ మండలం కుడికిళ్ళ గ్రామానికి చెందిన ఎస్.అర్జునయ్య కు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన రూ.200,000/- ( రెండు లక్షల) చెక్కును నేడు ఆయన అందచేశారు.
పేదవారికి ఎలాంటి కష్టం రాకూడదు అని వారి వైద్య సేవలకు అయిన ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.
తమపై ప్రత్యేక శ్రద్ధ చూపించి రెండు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కి జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా S.అర్జునయ్య కుటుంబ సభ్యులు తెలిపారు.