26.7 C
Hyderabad
April 27, 2024 07: 08 AM
Slider కృష్ణ

ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి…

#KrishnaDistCollector

గత కొన్ని రోజులుగా కోవిడ్ – 19 కేసులు అధికంగా నమోదు అవుతున్న నేపథ్యంలో బుధవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కృష్ణాజిల్లా కలెక్టర్  ఏ.యండి. ఇంతియాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను, స్థానిక వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రతిఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుహాసిని, డీసిహెచ్‌ఎస్ జ్యోతిర్మయి, జిల్లా ఆరోగ్యశ్రీ క్లినిక్స్ కో- ఆర్దినేటర్ మోతి బాబు, తహశీల్దార్ రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్, ఎంపిడిఓ జయచంద్ర గాంధీ, రాకేం ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ యం సత్యనారాయణ రెడ్డి, సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ చినబాబు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శిగా పతివాడ

Satyam NEWS

అరుణ తారకు బిజెపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి

Satyam NEWS

వాలీబాల్ విజేత చింత‌ల‌మ‌నేప‌ల్లి జ‌ట్టు

Sub Editor

Leave a Comment