42.2 C
Hyderabad
April 26, 2024 18: 19 PM
Slider మహబూబ్ నగర్

ఓట్ల కోసం దళితులతో ఆడుకుంటున్న సీఎం కేసీఆర్

#dalitdandora

నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని దళిత వాడలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, గోవు రాజు ఆధ్వర్యంలో నేడు దళిత దండోరా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి కొల్లాపూర్ నియోజకవర్గ దళిత, గిరిజన దండోరా సమన్వయకర్త దండెం రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు టీపీసీసీ కార్యదర్శి కేతురి వెంకటేష్, టీపీసీసీ మహిళ కార్యదర్శి కటమోని తిరుపతమ్మ, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుమోని రాము యాదవ్, కటమోని కృష్ణయ్య గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు దళిత,గిరిజన దండోరా యాత్రలో భాగంగా నేడు పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం అమలుచేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ని బొంద పెడితే గానీ రాష్ట్రంలో ఉన్న దళితుల  జీవితాలు బాగుపడవని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే టిఆర్ఎస్ పార్టీ అంతం, దళితుల అభివృద్ధికి పంతం కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని వారు పేర్కొన్నారు. హుజురాబాద్ లో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం కేవలం ఒక నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో దళితులకు అందరికీ అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రతి ఎలక్షన్ సమయంలో కొత్త పథకాలు ప్రవేశ పెట్టడం ఎలక్షన్స్ తర్వాత బందు చేయడం అలవాటుగా మారిందని వారన్నారు. ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకోవాలని సూచించారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలోని మండలాల పార్టీ అధ్యక్షులు, కిషన్ మండల అధ్యక్షులు,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు, మైనార్టీ సెల్ మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ యువజన విభాగం మండలాల అధ్యక్షులు,పెంట్లవెల్లి మండలం లో ఉన్న వివిధ గ్రామాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం పెంట్లవెల్లి మండల తాసిల్దార్ రమేష్ నాయక్  కి వినతి పత్రం ఇచ్చారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మళ్లీ ప్రజల్లోకి వస్తున్న నారా భువనేశ్వరి

Satyam NEWS

టీడీపీ నినాదం.. జేడ్పీ చైర్మన్ నోటి వెంట..!

Bhavani

నా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా నా వారిని కాపాడుకొంటా…

Satyam NEWS

Leave a Comment