40.2 C
Hyderabad
April 28, 2024 16: 35 PM
Slider ముఖ్యంశాలు

ఆరు గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తాం: మంత్రి పొంగులేటి

#uttamkumarreddy

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రభుత్వం పారదర్శకతతో అందజేస్తుందని రాష్ట్ర రెవెన్యూ,గృహనిర్మాణ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్  ప్రభుత్వ హయంలో శ్రీ ఫణిగిరి సీతారామచంద్ర రామస్వామి గుట్ట వద్ద ఆదర్శనగర్ లో నిర్మించిన 2,160 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలసి పరిశీలించారు. తదుపరి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజక వర్గ స్థాయిలో జరుగు అభివృద్ధి,సంక్షేమ పథకాలపై అమలుపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలసి మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పి.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ 2013లో స్థానికంగా గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను 3 నెలల లోపు పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు అందచేసి రాష్ట్రంలోని ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన 109 ఎకరాల భూమిని దాదాపు 20 కోట్ల రూపాయలు రెవెన్యూ శాఖ ద్వారా చెల్లించి గృహ నిర్మాణ శాఖ ద్వారా నిర్మించడం జరిగిందని,దాదాపు 70 శాతం పూర్తి అయిన పనులు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు వరకు కూడా 30 కోట్లు  కేటాయించి పూర్తి చేయకపోవడం ఒక దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

గత పది సంవత్సరాలుగా నియోజక వర్గంలో నిజమైన నిరుపేదలకు అందలేదని అన్నారు.77 ఎకరాలలో ఉన్న ఆదర్శ కాలనీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని,అలాగే 32 ఎకరాలలో ఉన్న ఖాళీ స్థలంలో అర్హులైన వారిని గుర్తించి అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో సుపరిపాలన అందిస్తామని, పాలకులం కాదు సేవకులుగా ప్రజా సేవకు అంకితమవుతామని అన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని,ఒక్క గజం భూమి కూడా వదలమని,తిరిగి అట్టి భూములను అర్హులైన పేదలకు అందించి ఇందిరమ్మ రాజ్యం తెస్తామని అన్నారు.

గత ప్రభుత్వం మాటల గారడితో రాష్ట్రంలో ఎన్నో శంకుస్థాపనలు చేసుకుంటూ పోయిందని,రాష్ట్రాన్ని అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని అన్నారు తెలిపారు. ఈ నెల 27న ప్రజలకు తీపి కబురు ఉంటుందని,అలాగే 6 గ్యారెంటిలతో పాటు మ్యానిఫెస్టో గల అన్ని అంశాలను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. రెండు పడకలలో నచ్చిన వారికి ఇండ్లను అందచేసినట్లు ఫిర్యాదులు అందాయని అట్టి వారిపై విచారణ జరిపి అర్హులైన పేదలకు అందించాలని కలెక్టర్ కు సూచించారు.

రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖా మంత్రి  ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల రంగంలో  పటిష్ఠ ప్రణాళికతో రైతులకు మెరుగైన నీటి సదుపాయం కల్పిస్తామని,జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ లు,చెక్ డ్యామ్స్ లను  పునరుద్ధరించడం జరుగుతుందని అన్నారు.పి.ఆర్.అలాగే ఆర్.అండ్ బి శాఖల ద్వారా రోడ్ల మరమ్మత్తులు, కొత్త రోడ్లను వేయిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఒక ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని, గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖనే మరిచిందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ 6 గ్యారంటీలను రాజకీయాలకు అతీతంగా అందచేస్తామని,ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు పూర్తి న్యాయం జరుగుతుందని అన్నారు.

రైతులకు ఎక్కడా కూడా నష్టం వాటిల్లకుండా అనుబంధ శాఖల అధికారులు నిబద్ధతగా పనిచేయాలని లిఫ్ట్ ఇరిగేషన్ ల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మన్లను మరమ్మత్తులు సత్వరమే  చేసి వినియోగం లోకి తేవాలని,ప్రభుత్వం నుండి నిధులను సత్వరమే విడుదల చేస్తామని ఈ సందర్భంగా సూచించారు. తదుపరి అన్ని శాఖల అధికారులతో నియోజక వర్గ స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక,ఏ. వెంకట్ రెడ్డి,నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్  రమేష్, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి, సి.ఈ. ఓ సురేష్ కుమార్, పి.డి.కిరణ్ కుమార్,డి.పి.ఓ యాదయ్య,సి.పి.ఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు,మున్సిపల్ కమిషనర్లు,ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

40 ఏళ్ల ఆడమ్ కు ఎయిడ్స్ వ్యాధి నయం అయింది

Satyam NEWS

Complaint to Amit shah: మితిమీరిన జగన్ రెడ్డి అరాచకాలు

Satyam NEWS

కరోనా కరోనా: వలస బతుకులకు తప్పని తిప్పలు

Satyam NEWS

Leave a Comment