సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి మహా క్షేత్రములో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వయంభు శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కోవెలలో తెల్లవారుఝామున స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
పరమ పవిత్ర కృష్ణానది ఉత్తర వాహిని కి,శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయమునకు సమీపములో గల శ్రీ మట్టపల్లి మహా క్షేత్ర లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రాహ్మణ బంధువులకు ప్రత్యేక ఏర్పాట్లు గావించారు. వివిధ ప్రాంతముల నుండి వచ్చిన యాత్రికులకు సకల సౌకర్యాలతో షడ్రసోపేతమైన భోజనాన్ని బ్రాహ్మణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అనంతరం 2024 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ను బ్రాహ్మణ బంధువుల సమక్షంలో ఆవిష్కరించి అందజేశారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులు మాట్లాడుతూ సరిగ్గా శోభకృత్ నామ సంవత్సరంలో ప్రారంభించబడిన అన్నదాన సత్రం నేటికీ 60 వసంతాలు పూర్తి చేసుకుందని,అనేక ప్రాంతాల నుండి వచ్చే బ్రాహ్మణ యాత్రికులకు భోజన సదుపాయంతో పాటుగా వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అన్నారు. పరమ పావనమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రానికి బ్రాహ్మణ బంధువుల రద్దీ పెరిగినందున సకల సౌకర్యాలతో నూతన భవనాన్ని నిర్మాణం చేపట్టామని,ఈ భవన నిర్మాణంలో బ్రాహ్మణ బంధువులు భాగస్వాములు కావాలని,ఆర్థిక,హార్దిక సహాయ సహకారాలు అందించాలని కమిటీ సభ్యులు కోరారు. మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి తమ శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి చెన్నూరి మట్టపల్లి రావు,బాచిమంచి చంద్రశేఖర్ శర్మ,ఉపాధ్యక్షుడు పుల్లాభొట్ల శివ,రంగరాజు వాసుదేవరావు,భువనగిరి శ్యాంసుందర్, దివాకరుని హనుమంతరావు, బొబ్బిళ్ళపాటి శేషు,హెచ్ డి ఎఫ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, నారపరాజు నరసింహారావు, పులిజాల శంకర్రావు, అన్నపూర్ణ,సత్రం సిబ్బంది రామారావు,సుబ్బారావు,గౌతమ్,బ్రాహ్మణ బంధువులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్