32.7 C
Hyderabad
April 27, 2024 02: 36 AM
Slider నల్గొండ

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి  మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రేగులగడ్డ తండా సర్పంచ్ బానోతు ఉష వెంకటేశ్వర్లు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

 ఆయనతో బాటు గారకుంట తండా సర్పంచ్ గుగులోతు బాబునాయక్, కపురాయతాండ సర్పంచ్ పాండునాయక్, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కోమరాజు నర్సయ్య వారి అనుచరులతో టిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన సర్పంచ్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో ఎమ్మెల్యే సైదిరెడ్డి  చేపడుతున్న  అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్,   టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు అరవింద రెడ్డి,  టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అమరనాథ్ రెడ్డి, తాళ్ళమల్కాపురం సర్పంచ్ కుక్కడపు జ్యోతి గురువయ్య ,ఎంపిటి సి బానోతు రాములు,  పిఎసియస్ మాజీ వైస్ చైర్మన్ జయరాం నాయక్, లింగయ్య ,ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్పెషల్ కార్ : హైలో హైలెస్స హంస కదా నా కారు

Satyam NEWS

అమరావతిపై నిపుణుల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment