రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం మేడ్చల్ మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ముందుగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. అనంతరం లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోలన్ రాజశేఖర్ రెడ్డి, జూలకంటి లక్ష్మారెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆయా డివిజన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.