మంత్రి మల్లారెడ్డి మైక్ ఉంది కదా అని టి పిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని ఇష్టమొచ్చినట్లు కారు కూతలు కూస్తే కర్రు కాల్చి వాత పెడతామని నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవు రాజు హెచ్చరించారు.
మంత్రి మల్లారెడ్డి ఆ బాష ఏమిటి? మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఆ ఏజ్ ఏంటి? నీ గేజ్ ఏంటి? మీ వయసుకు తగ్గ పనులు చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
మీరు తొడ కొట్టే లోపే రేవంతన్న యువ సైన్యం మీ తొడ తీసి మీ చేతిలో పెడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. మీ పైన అవినీతి ఆరోపణలు చేస్తే మీ శీలాన్ని నిరూపించుకోవాలి గాని అడ్డొచ్చిన ఆంబోతు వలే రంకెలు వేయడం తగదన్నారు.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా నీచ సంస్కృతిని ఎవరు ఆవలభించలేదు అన్నారు. టిఆర్ఎస్ రాక్షస పాలనలో కేసీఆర్ అధ్యక్షతన రాక్షసుల పాలన నడుస్తోందని దుయ్యబట్టారు.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బూతు పురాణాలు మాట్లాడడం ఒక ఫ్యాషన్,ఒక ట్రెండ్ అయిపోయింది,ఇది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అన్నారు. మొన్న జరిగిన పార్లమెంటు మల్కాజ్గిరి ఎన్నికల్లో మీ అల్లుడు అల్లుడు పైన టైగర్ రేవంత్ రెడ్డి గెలిచింది నిజం కాదా? మల్లారెడ్డి అదే రేవంతన్న 2014లో మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేసి ఉంటే నీకు డిపాజిట్లు కూడా దక్కేది కాదు అన్నారు.
అదే ఒక బహుజన మంత్రి పైన ఆరోపణలు వస్తేనే భర్తరఫ్ చేసిన ఘనత కెసిఆర్ ది, నేడు వందల ఎకరాలలో భూకబ్జాలు చేసిన మంత్రి మల్లారెడ్డిని భర్త చేసే దమ్ము ధైర్యం కేసీఆర్ ఉందా అని ప్రశ్నిస్తున్నాను.
మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ సీలింగ్ చట్టమును తెచ్చి ఇలాంటి మల్లారెడ్డి లాంటి భూకబ్జా కోరుల చెరలో ఉన్న వందల భూములన్నీ విడిపించి పేద ప్రజలకు పంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నరేష్ నాని తదితరులు పాల్గొన్నారు