నల్లగొండ పార్లమెంట్ పరిధిలో సభ్యత్వం నమోదు చేసే ఎన్రోలర్లను వారి బూత్లలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేసేలా ప్రోత్సహించడానికి మాజీ పిసిసి చీఫ్, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించి ఎన్రోలర్లతో మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మండలాల వారీగా నేరేడుచర్ల,పాలకీడు,మేళ్లచెరువు, మల్లారెడ్డిగూడెం,మఠంపల్లి మండలాల్లో పర్యటించి బూత్ ఎన్రోలర్లకు సభ్యత్వ నమోదు గురించి పలు సూచనలు చేసారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టాన్ని గుర్తిస్తుందని, ముమ్మరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్