దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి.
కొత్తగా నిన్న ఒక్క రోజు 16,738 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా 138 మరణాలు నమోదు అయ్యాయి.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914 కు చేరింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,56,705 కు చేరింది.
కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చిన 10 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ తన ప్రతినిధులను పరిశీలకులుగా పంపింది.