26.7 C
Hyderabad
April 27, 2024 09: 09 AM
Slider నల్గొండ

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఎన్నిక ఏకగ్రీవం

#AITUCmeeting

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో గురువారం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ (ఏ ఐ టీ యూ సీ అనుబంధ సంస్థ) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో అధ్యక్షునిగా ములకలపల్లి రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గౌరవ అధ్యక్షుడిగా ములకలపల్లి శ్రీను, గౌరవ సలహాదారుడిగా జడ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా ములకలపల్లి నరసింహారావు, దాసరి నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా దగ్గుపాటి సత్యానందం, సహాయక కార్యదర్శి గా చక్రాల బోసు, వీరబాబు, కోశాధికారిగా ఎస్ కే భాష ఎన్నికయ్యారు.

అదే విధంగా కార్యవర్గ సభ్యులుగా పిట్టల శ్రీను, జి రాంబాబు, ఉండేటి నగేష్, జడ హుస్సేన్, లక్ష్మణ్, ప్రమోద్, పచ్చిపాల కోటేశ్వరరావు, యన్ నరసింహారావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ములకలపల్లి రాంబాబు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరికీ ఐడెంటిటీ కార్డులు, ఇన్సూరెన్స్ లు వచ్చే విధంగా తోడ్పడతానని, అలాగే అని చెప్పా సమస్యల పరిష్కారం కొరకు అందరికీ అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని అన్నారు.

తనపై ఎంతో నమ్మకంతో ఎందుకు నందుకు యూనియన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ యూనియన్ సభ్యులు, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యుత్  అధికారులు, కాంట్రాక్టర్లతో మహిళా రైతులు వాగ్వాదం…

Satyam NEWS

ధరణి పోర్టల్ తో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోరా?

Satyam NEWS

ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆ రోడ్ లో ప్రయాణం నరకం ప్రాయం..!

Satyam NEWS

Leave a Comment