వ్యవసాయ మోటారు కు మీటర్లు పెట్టడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి అన్నారు.
విద్యుత్ ఎంత వినియోగించినా బిల్లులు మేం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని అయితే ఇది సరైన విధానం కాదని ఆయన తెలిపారు.
అనధికార కనెక్షన్లు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నదని ఆయన తెలిపారు. వ్యవసాయ మోటర్ల కు మీటర్లు పెట్టడానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఉద్యమం చేపట్టబోతున్నాయని ఆయన తెలిపారు.
రైతుల ఆత్మహత్యల విషయం లో రాష్ట్రం మూడోవ స్థానం లో ఉందని ఆయన అన్నారు