సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం అంబర్ పేట్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామణ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర సెంట్రల్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు మహేందర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర ధరలకు వ్యతిరేకంగా నిరసన చేశారు. దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలని బ్యాంకులు రైల్వే సింగరేణి ఓడరేవులు ఎయిర్ ఇండియా భారత సైన్యాన్ని సహజ సంపద మొత్తం అంబానీ ఆదానీలకు అప్పజెప్పుతూ దేశంలో మత విద్వేష రాజకీయాలు చేస్తూ ప్రజల్ని ఆలోచించకుండా చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం సుబ్బారావు, షబానా, సోమయ్య, ధనరాజ్, రాయీస్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్