పాత కక్షల కారణంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఆరుగుర్ని అతి కిరాతకంగా నరికి చంపారు.
చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్నవారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.