శ్రీశైల మహాక్షేత్రంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా మహోత్సవాలలో భాగంగా మూడవ రోజైన నేడు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
స్వామి అమ్మవార్ల రావణవాహనసేవ లో ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు ,వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు.
అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు,రుద్రహోమం, చండీహోమాలు నిర్వహించారు. చతుర్వేదపారాయణలు, రుద్రపారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు నిర్వహించారు