28.7 C
Hyderabad
April 27, 2024 04: 42 AM
Slider కడప

ఈతకు వెళ్లి బాలుడు మృతి

#BoyDeath

కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం లోని కేతరాజు పల్లె లో ఆదివారం మధ్యాహ్నం రాజులు మడుగు లోకి ఈతకు వెళ్లి భరత్(13) అనే బాలుడు మృతి చెందాడు.

వత్తలూరు అగ్రహారం కు చెందిన నారాయణ కుమారుడు భరత్(13) మూడు రోజుల క్రితం తల్లితో కలిసి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడు.

తల్లి ఆదివారం ఉదయం సొంతూరికి పోగా నేను తర్వాత వస్తానని చెప్పి అమ్మమ్మ గారి దగ్గరనే బాలుడు ఉండి పోయాడు.

మధ్యాహ్నం ఈతకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతాని కి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పేద రైతులకు అన్యాయం చేయడమే రెవెన్యూ అధికారుల ఉద్దేశ్యమా?

Satyam NEWS

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందికి వైద్య శిబిరం

Satyam NEWS

అక్సిడెంట్:ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Satyam NEWS

Leave a Comment