కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం లోని కేతరాజు పల్లె లో ఆదివారం మధ్యాహ్నం రాజులు మడుగు లోకి ఈతకు వెళ్లి భరత్(13) అనే బాలుడు మృతి చెందాడు.
వత్తలూరు అగ్రహారం కు చెందిన నారాయణ కుమారుడు భరత్(13) మూడు రోజుల క్రితం తల్లితో కలిసి అమ్మమ్మ గారి ఇంటికి వచ్చాడు.
తల్లి ఆదివారం ఉదయం సొంతూరికి పోగా నేను తర్వాత వస్తానని చెప్పి అమ్మమ్మ గారి దగ్గరనే బాలుడు ఉండి పోయాడు.
మధ్యాహ్నం ఈతకు వెళ్లి లోతుగా ఉన్న ప్రాంతాని కి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.