Slider ప్రపంచం

చైనాకు దీటైన సమాధానం ఇచ్చేందుకు ప్లాన్ ఇదీ

#American Flag

డేటా చౌర్యం విషయంలో చైనా నిఘా వ్యవస్థలు, సాఫ్ట్ వేర్ సంస్థలు ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపథ్యంలో భారత్ తో కలిసి పని చేయాలని అమెరికా సెనేటర్ మార్క్ వార్నర్ సెనేట్ కు సమర్పించిన విధాన పత్రంలో పేర్కొన్నారు. భారత్, జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి పని చేయడం ద్వారా అమెరికా ఈ విధమైన చైనా డేటా చౌర్యం సవాల్ ను అధిగమించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.

అందుకోసం భారత్ ను శాశ్వత ప్రాతిపదికన భాగస్వామిగా చేసుకోవాలని ఆయన సూచించారు. అంతే కాకుండా ఈ మేరకు నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కు చేయాల్సి సవరణలను కూడా ఆయన ప్రతిపాదించారు. చైనా సంస్థలు, వ్యవస్థలు ప్రపంచ దేశాల డేటాను చోరీ చేస్తున్నాయని, డేటా అంతా సేకరించి తమ వద్ద ఉంచుకుంటున్నాయని వస్తున్న ఆరోపణలకు ఈ విధంగా సమాధానం చెప్పవచ్చునని మార్క్ వార్నర్ అభిప్రాయపడ్డారు.

Related posts

సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ఆకస్మిక మృతి

Satyam NEWS

రాచకొండ కమిషనరేట్ లో ఎమర్జెన్సీ సర్వీసు వాహనాలు

Satyam NEWS

ఘనంగా రమణ మహర్షి జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!