డేటా చౌర్యం విషయంలో చైనా నిఘా వ్యవస్థలు, సాఫ్ట్ వేర్ సంస్థలు ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపథ్యంలో భారత్ తో కలిసి పని చేయాలని అమెరికా సెనేటర్ మార్క్ వార్నర్ సెనేట్ కు సమర్పించిన విధాన పత్రంలో పేర్కొన్నారు. భారత్, జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి పని చేయడం ద్వారా అమెరికా ఈ విధమైన చైనా డేటా చౌర్యం సవాల్ ను అధిగమించవచ్చునని ఆయన స్పష్టం చేశారు.
అందుకోసం భారత్ ను శాశ్వత ప్రాతిపదికన భాగస్వామిగా చేసుకోవాలని ఆయన సూచించారు. అంతే కాకుండా ఈ మేరకు నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ కు చేయాల్సి సవరణలను కూడా ఆయన ప్రతిపాదించారు. చైనా సంస్థలు, వ్యవస్థలు ప్రపంచ దేశాల డేటాను చోరీ చేస్తున్నాయని, డేటా అంతా సేకరించి తమ వద్ద ఉంచుకుంటున్నాయని వస్తున్న ఆరోపణలకు ఈ విధంగా సమాధానం చెప్పవచ్చునని మార్క్ వార్నర్ అభిప్రాయపడ్డారు.