సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో వైద్య సేవలు నిలిచిపోయాయి. అక్కడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డు పైనే బైఠాయింపు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ నర్సులు ఆందోళన చేస్తుండగా ఇప్పడు గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళనకు దిగారు.
ఔట్ సోర్సింగ్ నర్సులు ఐదు రోజుల నుండి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేటి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా విధులు బహిష్కరించడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలకు అంతరాయం కలుగుతుంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు.