విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని కేజీబీవీ ఉపాధ్యాయులకు డీఈవో గోవిందరాజులు సూచించారు. సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యా బోధన పరిశీలించారు. సిలబస్ ఎంత వరకు పూర్తయిందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు పనితిరుపై ఆరా తీశారు. కేజీబీవీ సమస్యలపట్ల విద్యార్థులను ఆరా తీశారు.బాలికలకు నాణ్య మైన భో జనంతో పాటు మెరుగైన విద్యను అందించి నప్పుడే గురువులు తమ గురుత బాధ్యతను నెరవేర్చిన వారు అవుతారని డీఈవో అన్నారు. కస్తూర్భా గాంధీ పాఠశాల రికార్డులను పరిశీలించి పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని నిర్వహకులను ఆదేశించారు. బాలికలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలని ఆయన నిర్వహకురాలు ఆదేశించారు. ఆయన వెంట సెక్టోరల్ అధికారి అహ్మద్ వెంకటేశ్వర్లు శెట్టి పాల్గొన్నారు.
previous post