తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి దర్శించుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల రాక సందర్భంగా ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పద్మావతి అమ్మవారికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు డిప్యూటీ స్పీకర్ కోలగట్లకు తీర్థప్రసాదాలతో పాటు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ బోర్డు చైర్మన్ గుబ్బ చంద్రశేఖర్, విజయనగరం పైడితల్లి అమ్మవారి పాలకమండలి సభ్యులు ఎంకే బి శ్రీనులు తదితరులున్నారు.దీనికి ఒక్క రోజు ముందే తిరుమల ఉండే వెంకన్నను డిప్యూటీ స్పీకర్ కోలఖట్ల దర్శించుకున్న సంగతి తెలిసిందే.
previous post
next post