డివిజన్ పరిధిలోని సమస్యలను పరిష్కరించి డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ అన్నారు. బుధవారం హరిజన బస్తీ స్ట్రీట్ నంబర్ ఒకటిలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు . కార్యక్రమంలో ఎయి కీర్తీ శ్రీ, బిజెపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, కుంభం శ్రీనివాస్, భాస్కర్, గన్నారం రేష్మ, బండారి సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
previous post