28.7 C
Hyderabad
April 26, 2024 08: 02 AM
Slider చిత్తూరు

ఎస్వీబీసీ ఎండిగా ఎవి.ధ‌ర్మారెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

Dharmareddy

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి బుధ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద గ‌ల ఎస్వీబీసీ కార్యాల‌యంలో ఈ మేర‌కు ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ త‌న‌కు అద‌నంగా అప్ప‌గించిన ఈ బాధ్య‌త‌ల‌కు పూర్తి న్యాయం చేస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఎస్వీబీసీ బోర్డుకు, టిటిడి బోర్డు ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డికి, ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో స్వామివారి లీలావిశేషాల‌ను, సేవ‌లను, ఉత్స‌వాల‌ను ఛాన‌ల్ ప్ర‌సారాల ద్వారా భ‌క్తుల‌కు మ‌రింత చేరువ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని వివ‌రించారు. ఛాన‌ల్ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో వెంక‌ట‌న‌గేష్‌, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ఎసి.శ్రీ‌, టిటిడి ప్రాజెక్టుల లైజాన్ అధికారి వెంక‌ట‌శ‌ర్మ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

హనుమంత వాహనం పై శ్రీ కోదండరామ స్వామిగా సౌమ్యనాధ స్వామి

Satyam NEWS

విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

కాంట్రవర్సీ: నేలవిడిచి సాముచేస్తున్న వైసీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment