చలికి అలమటిస్తున్న అభాగ్యులను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది అనంతపురం జిల్లా అంబేద్కర్ రక్తదాన శిబిరం ట్రస్ట్. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ట్రస్టు సభ్యులు చలికి అలమటిస్తున్నవారికి, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ ట్రస్టులో ఎక్కువ మంది విద్యార్ధులే ఉంటారు. సామాజిక బాధ్యతగా వారు తమకు తోచిన ఈ సాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రక్తదాన శిబిరం టీం నుంచి నజీర్ భాష, ఆనంద్, మురళీకృష్ణ, పీరా సాహెబ్, మంజు రక్తదాన శిబిర సభ్యులు పాల్గొన్నారు.
previous post