జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ స్వచ్ఛంద సేవా సొసైటీ అనాధ పిల్లలను ఆదుకోవడంలో ముందుంది. చలికాలం అనాధ పిల్లలు చలికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ ఇబ్బందిని కొంత వరకూ అయినా తీర్చడానికి జడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి ముందుకు వచ్చారు.
అనాధ పిల్లలకు రగ్గులు, దుప్పట్ల కొనుగోలు చేసేందుకు వర్ధన్ స్వచ్ఛంద సేవా సొసైటీ కి ఆయన 10 వేల రూపాయలు సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి తో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షులు పోకల లింగయ్య, PACS వైఎస్ ఛైర్మెన్ నర్మెట్ట పెద్ది రాజిరెడ్డి వున్నారు.