బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామములో నిర్మిస్తున్న 50 రెండు పడక గదుల ఇండ్లను నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి నేడు పరిశీలించారు.
ఇప్పటికే పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటిలో మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని ఆయన కాంట్రాక్టర్ కు ఫోన్లో ఆదేశాలిచ్చారు.
ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ యం. నారాయణ్ రెడ్డి, గ్రామ రైతు బంధు అధ్యక్షులు డి. నారాయణరెడ్డి, మండల నాయకులు దొడ్ల వెంకట రామ్ రెడ్డి,
మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్, సొసైటీ డైరెక్టర్ సాయి రెడ్డి, సాయిలు, మాజీ డైరెక్టర్ సాయిలు, వసి మరియు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.