27.7 C
Hyderabad
April 26, 2024 06: 13 AM
Slider మెదక్

డబుల్ బెడ్ రూమ్ రిటర్న్ ఇచ్చిన ఫర్విన్ మంత్రి అభినంద‌న‌

Parwin

రెండు పడకల ఇళ్లును తిరిగి ప్రభుత్వానికి అప్పగించి ఫర్వీన్ సుల్తానా తన ఉదార్వాతాన్ని చాటింది. సిద్ధిపేట పట్టణంలోని 11వ వార్డులో నివసిస్తున్న ఫర్వీన్ సుల్తానాకు సిద్ధిపేటలోని కేసీఆర్ నగర్ లోని బ్లాకు నెంబరు 29 రూమ్ నెంబరు 7లో ప్రభుత్వ రెండు పడకల ఇళ్లు మంజురైంది. మరోవైపు తన బంధువులకు 11వ వార్డులో ఖాళీ స్థలం ఉండటం, అందులో ఇళ్లు కట్టుకునే ఆలోచన వచ్చి మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో గురువారం రాత్రి కలిశారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ను మరొక లబ్దిదారుకు ఇచ్చే ఆలోచనతో ముందుకొచ్చినట్లు అందుకు సంబంధించిన స్థల పత్రాలను మంత్రి చేతికి రిటర్న్ ఇచ్చింది. ఈ మేరకు ఫర్వీన్ సుల్తానా ఉదారత్వం చూసి మంత్రి హరీశ్ రావు భార్యాభర్తలను అభినందించి వారిద్దరినీ శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇద్దరు పాత నేరస్తుల దారుణ హత్య

Satyam NEWS

నేషనల్ ఇన్స్పైర్ పోటీలకు ములుగు నుంచి ఒక ప్రాజెక్టు ఎంపిక

Satyam NEWS

భోగి డాన్సు చేసి అలరించిన అంబటి రాంబాబు

Satyam NEWS

Leave a Comment