ఒమిక్రాన్ విజృంభిస్తున్నది…. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి… రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నాం…. ఎవరైనా ఐదుగురి కన్నా ఎక్కువ గుమికూడితే పోలీసులు కేసులు పెడతారు…. ఇవన్నీ ప్రతిపక్షాల వారి సమావేశాలకే. అధికార పార్టీకి చెందిన వారికైతే ఇలాంటివి ఏమీ ఉండవు. వారంతా కరోనాకు అతీతంగా ఉంటారు. ఈ వీడియోలో ఉన్న వ్యక్తి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయాలలో ప్రముఖుడుగా ఉన్న అంబటి రాంబాబు ఆ మధ్య కాల్ రికార్డింగ్ లో దొరికి మరింత వివాదాస్పదుడయ్యారు. ఒక సారి కరోనా వచ్చిన రాంబాబు కోలుకున్నారు. అయితే ఆయన భోగి పండుగ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. ఆయన ఒక్కడే డాన్సు చేయడం కాదు. లంబాడా మహిళలను పిలిపించుకుని, వారందరితో కలసి ఆయన నృత్యం చేశారు. ఒకరితోనో ఇద్దరి తోనో కలిసి చేయడం కాకుండా వచ్చిన మహిళందరి చేతులు పట్టుకుని మరీ ఆయన డాన్సు చేశారు. అందరికి కరోనా నిబంధనలు గుర్తు చేసే పోలీసులు ఏమయ్యారో తెలియదు కానీ ఆయన మాత్రం ఎంతో ఆనందించారు…. డాన్సు చేసి. ఆ విధంగా భోగి పండుగను అంబటి రాంబాబు ‘‘ఒక గంట’’ పాటు ఆనందంగా అనుభవించారు.
previous post