40.2 C
Hyderabad
April 28, 2024 17: 27 PM
Slider కృష్ణ

క‌ట్నం కోసం అత్త‌, మామ‌ల‌ను చంపిన అల్లుడు!

Murder

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదనే కోపంతో అత్త, మామలను అల్లుడు గొంతు కోసి చంపాడు. ఈ ఘ‌ట‌న‌తో చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. నాలుగు నెలల క్రితం మైనర్ బాలిక మనీషాను నెమ‌లిబాబు ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంత‌రం కట్నం కావాలంటూ ప‌లుమార్లు మామ కోటా ముత్తయ్య, అత్త సుగుణమ్మలను వేధించేవాడు. ఈ నేప‌థ్యంలో మ‌నీషా స‌హ‌కారంతో అత్తా, మామలను గొంతు కోసి నెమ‌లిబాబు హ‌త్య చేశాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మ్ర‌త‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించి నిందితుడు నెమ‌లిబాబు, మ‌నీషాల‌ను అరెస్టు చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts

పిఆర్సి నివేదికలను దహనం చేసిన TUTF ఉపాధ్యాయులు

Satyam NEWS

1.30 లక్షల ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ !

Bhavani

‘కొత్త’ను స్వాగతిద్దామిక

Satyam NEWS

Leave a Comment