ప్రముఖ సినీ నటుడు డాక్టర్ రాజశేఖర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన నేడు బంజారా హిల్స్ లోని సిటీ న్యూ సెంటర్ ఆసుపత్రి నుంచి ఢిశ్చార్జి అయ్యారు.
కరోనా కారణంగా ఆయన గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన డిశ్చార్జి అయ్యే ముందు ఆసుపత్రి సిబ్బందితో సంతోషంగా కొద్ది సేపు గడిపారు.
వారంతా కూడా ఉత్సాహంగా ఆయనతో ఫొటోలు తీయించుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తన భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్య బృందానికి జీవిత ధన్యవాదాలు తెలిపారు.
అభిమానులు, సన్నిహితుల ప్రార్ధనలు ఫలించి రాజశేఖర్ కోలుకున్నారని జీవిత అన్నారు.