హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద డ్రగ్స్ పై యువతలో అవగాహన కల్పించే కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీలో ఎంతో మంది యువకులు ఉత్సాహవంతులతో బాటు పోలీసులు కూడా పాల్గొన్నారు.
మత్తు వీడాలని, సైక్లింగ్ లాంటి స్పోర్ట్స్ అలవాటు చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వీడండి.. సైక్లింగ్ చేయండి అంటూ నినాదాలు చేశారు. డ్రగ్స్ మత్తు వదిలేద్దాం.. సైక్లింగ్ తో ఆరోగ్యంగా ఎంజాయ్ చేద్దాం అంటూ యువతలో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైక్లిస్ట్ లు చార్మినార్ వద్దకు హాజరయ్యారు.