అనుచిత వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీకి చెందిన ప్రముఖుల సూచనల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లో సుమారు 20 వేల మంది యాదవ-ముస్లిం ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని అఖిలేష్ యాదవ్ సెప్టెంబర్ 29న ఆరోపించారు. కొంత మందిని ఒక బూత్ నుంచి మరో బూత్కు బదిలీ చేశారని ఇదంతా కుట్ర పూరితంగా చేశారని ఆయన తీవ్ర మైన ఆరోపణ చేశారు. ఇందుకు సంబంధించి నవంబర్ 10వ తేదీలోగా ఎస్పీ అధ్యక్షుడు ఆధారాలు సమర్పించాలని కమిషన్ పేర్కొంది.
previous post