హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్సీ N. రామ్ చందర్ రావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రెండవసారి పెద్దల సభకు పంపవలసిందిగా బాగ్ అంబర్పేట్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి కోరారు.
డి డి కాలనీ లో ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు అడ్వకేట్ అయిన రామ్ చందర్ రావు విద్యార్థుల సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీశారని తెలిపారు.
అలాంటి ప్రశ్నించే బిజెపి అభ్యర్థి రామచంద్ర రావుని పెద్దల సభకు పంపవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమరావు, నగర బిజెపి మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి,
ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మురళీధర్ గౌడ్ రాష్ట్ర నాయకులు రాజి రెడ్డి, వినోద్ యాదవ్, చుక్క జగన్, పాండురంగయ్య, సూర్యారావు, రామ్ రెడ్డి, సురేష్ గౌడ్, హరి నాయక్, రాము, కోడూరు సురేష్, మల్లేష్, మిర్యాల శ్రీనివాస్, ఆంజనేయులు, కరణ్ రెడ్డి, మల్లారెడ్డి, తదితరులొపాల్గొన్నారు.