ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానని స్నేహితుడు హెచ్చరించడంతో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. డా.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఈ ఘటన జరిగింది. ముమ్మిడివరం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ చదువుతున్న కుడుపూడి శృతి ఈ ఘటనలో మరణించింది. శృతి ఇంజినీరింగ్ విద్యార్ధిని. ఆమె ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు చెపుతానని ఆమె స్నేహితుడి మిత్రుడు పృధ్వ బెదిరించడంతో భయపడి గడ్డిమందు తాగింది. ఈ ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్న ఆమెను కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.