సాయిని వెంకటేశం పుష్పాలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు నేడు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. కరోనా మహమ్మారి విజృంభనతో 60 రోజులుగా చేయడానికి పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కళాకారులకు హై కోర్ట్ న్యాయవాది సాయిని వెంకటేశం ఆపన్న హస్తం అందించారు.
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయిని వెంకటేశం పుష్పాలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది చేనేత కళాకారులకు 10 కిలోల బియ్యం, వంట నూనె, కంది పప్పు, కారం పొడి, సబ్బులు అందజేశారు.
అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, పద్మశాలి మిషన్ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ తడక యాదగిరి, అఖిల భారత పద్మశాలి సంఘ మహిళ విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, అఖిల భారత పద్మశాలి సంఘం న్యాయ విభాగం అధ్యక్షులు వనం విశ్వనాథం, అఖిల భారత పద్మశాలి సంఘ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొని చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎల్బీ నగర్ చేనేత కార్మికుల సంఘం అధ్యక్షుడు చెరుకు స్వామి మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆకలి తీరుస్తున్న సాయిని వెంకటేశం గారికి, ట్రెస్ట్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.