28.7 C
Hyderabad
April 26, 2024 07: 59 AM
Slider హైదరాబాద్

జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ

#Collector Vasam Venkateswarlu

జర్నలిస్టుల సమస్యలు తనకు తెలుసని, కలెక్టర్ కాక ముందు తాను కూడ జర్నలిస్ట్ నే అని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కలయిక అని అదనపు కలెక్టర్ విద్య సాగర్ రావు అన్నారు. 

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ లో మల్కాజిగిరి రెవెన్యూ డివిజన్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్ట్లకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ విద్యా సాగర్ రావు విచ్చేశారు.

వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ కాక ముందు తాను కూడా జర్నలిస్ట్ నే, జర్నలిస్టు సమస్యలు అనేక సమస్యలు ఉంటాయని అయిన వాటిని అధిగమించి కరోనా కాలం లో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్ లను ఆదుకోవాలనే జర్నలిస్టులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.

జర్నలిస్టులు యూట్యూబ్ చానెల్స్, ఈ-పేపర్స్ ఏర్పాటు చేసుకొని కరోనా కాలంలో, విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్ట్లు రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ ఉన్న కూడా పోలీసులు, మెడికల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు జర్నలిస్టులు

కూడ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించడంతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు సంజీవ రావు, నిర్మల, గౌరీ వస్థల, మహిపాల్, మహిపాల్ రెడ్డి, బాలానగర్ సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ బాలరాజు తో డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.

Related posts

ఉమెన్స్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి

Bhavani

ఘనంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ పుట్టినరోజు

Bhavani

“బ‌జార్ రౌడి” తో స్టెప్పులేయించిన ప్రేమ్ ర‌క్షిత్‌

Satyam NEWS

Leave a Comment