వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలోని ఓల్డ్ రామాలయం యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ వినాయకుని పూజలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. గణనాయకుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సునీల్, మోహన్, ప్రశాంత్, యోగేష్ కృష్ణ, యాదవ యువసేన నాయకులు జగన్ యాదవ్, రాజు గుప్తా, మాజర్, సోను తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్