తనపై పెట్రోల్ పోసుకొని నిద్రిస్తున్న భార్య ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలోని పాత పాల్వంచ చెందిన నాకు రామకృష్ణ అనే వ్యక్తి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తాళలేక గత ఐదు నెలలుగా రాజమండ్రి లోని అత్తగారింటి వద్ద ఉంటూ నిన్న రాత్రి ఏడు గంటలకు పాత పాల్వంచ తమ స్వగృహానికి చేరుకొని చికెన్ తీసుకొని వచ్చి కుటుంబ సమేతంగా భోజనం చేశారు అనంతరం కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా వారి పై పెట్రోల్ పోసి తను పోసుకుని గ్యాస్ లీక్ చేసి నిప్పంటించడు కూతురు సాహితీ మేలుకొని బయటికి వచ్చి గట్టిగా అరవడంతో స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు అప్పటికే ముగ్గురు చనిపోయారని నిర్ధారించుకుని కొన ఊపిరితో ఉన్న సాహితీ నీ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఇది ఇలా ఉండగా సంఘటనా స్థలానికి చేరుకున్న పాల్వంచ పోలీసులు క్లూస్ టీం ను రంగంలో దింపి దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా కారులో ఒక సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు దానిలో కొంతమంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లు ASP రోహిత్ రాజ్ వెల్లడించారు.
previous post